Annadatha sukheebhava scheme 2025
అన్నదాత సుఖీభవ పథకం Annadatha Sukhebhava Scheme అనేది రైతుల పంటలకు పెట్టుబడి సాయం అందించడానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలను 3 విడతల్లో అందించడానికి NDA కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. రైతులకు అందిస్తున్న ఈ పెట్టుబడి సాయం లో Pm kishan నిధులు 6,000 రూపాయలు మరియు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 14,000 కలిపి రైతులు యొక్క ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. చిన్న,సన్నకారు,కౌలు, అటవీ భూహక్కుదారు రైతులకు సైతం ఈ పథకం వర్తిస్తుంది.
Table of Contents
Eligibility of Annadatha Sukheebhava Scheme – అర్హతలు
▶️ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. గుర్తింపు పొందుటకు రైతు యొక్క ఆధార్ ఆంధ్రప్రదేశ్ చిరునామా కలిగి ఉండాలి.
▶️ చిన్న,సన్న కారు రైతులు 5 ఎకరాల లోపు భూమి కలిగిన వారు మాత్రమే అర్హులు.
▶️ రైతులు భూమికి సంబంధించిన పత్రాలు, పట్టాదారు పాస్ బుక్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. అటవీ భూహక్కుదారులకు ROF పట్టా ఉండాలి. కౌలు రైతులకు CCRC కార్డు ఉండాలి.
▶️ రైతులు తాము పండించే పంట యొక్క వివరాలను రైతు సేవ కేంద్రాల ద్వారా వివరాలను అప్డేట్ చేస్తూ ఉండాలి.
▶️ రైతులు తమ యొక్క ఖాతా నెంబర్ కు ఆధార్ లింక్ తప్పనిసరిగా చేసుకొని ఉండాలి.
▶️ రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన లబ్ది పొందాలి అంటే ఆధార్ తో లింక్ అయిన అకౌంట్ కి తప్పనిసరిగా minimum Balance Maintain చేస్తూ ఉండాలి.NPCI Active లో ఉంచుకోవాలి.
▶️PM కిసాన్ పొందుతున్న ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా తెలుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
▶️ రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఒక కుటుంబానికి సంబంధించి వేరువేరు రేషన్ కార్డులు కలిగి భూమి కూడా కలిగి ఉండినట్లయితే ఈ పథకం వస్తుంది.
▶️Land Holding,House Hold Mapping తప్పనిసరి.
Ineligibility of Annadatha sukheebhava scheme – అనర్హతలు
▶️ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి Income Tax చెల్లించేవారికి ఈ పథకం వర్తించదు.
▶️ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఉత్తర్వుల ప్రకారము కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు,రాజకీయ నాయకులు,ప్రజాప్రతినిధులు, విశ్రాంతి ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు.
▶️ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకోవడం జరిగింది. దీనివల్ల కుటుంబంలో ముగ్గురు,నలుగురు రైతుల పేరిట భూమి ఉన్న గాని ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఒకరికి మాత్రమే అర్హత కలిగి మిగిలిన వాళ్ళు అనర్హత పొందుతారు.
How to apply for annadatha sukheebhava scheme – ధరఖాస్తు చేయు విధానం
ముందుగా రైతులు తమ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, పటాదారు పాసుబుక్,1b, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది.
⏬
అధికారులకు ఇచ్చిన పత్రాలను పరిశీలించి వివరాలను పరిశీలన చేసి Annadhatha Sukhebhava Scheme Eligibile లిస్టులోకి పేరును నమోదు చేస్తారు.
⏬
రైతు సేవా కేంద్రాల వారిగా నమోదైన Web land Data పరిశీలించిన తర్వాత అన్నదాత సుఖీభవ ఎలిజిబుల్ లిస్టు లోకి పేరు నమోదు చేస్తారు.
⏬
వివరాలు ఏమైనా తప్పుగా వస్తే సంబంధించిన రైతుల వివరాలను VRO గారికి అందజేయడం జరుగుతుంది.VRO గారు పూర్తి పరిశీలన చేసి ఈ పథకానికి అర్హులా కాదా అని వివరాలను మరల MAO వారికి అందించడం జరుగుతుంది.
Require Documents For Application – కావాల్సిన డాక్యుమెంట్స్
- Farmer ID (Aadhar Card)
- ROR 1B/Patta/Passbook
- Mobile Number(Which is linked with Aadhar)
- Bank Passbook
- Passport size photo
- Ration card
Annadatha Sukheebhava Scheme Payment – పేమెంట్ జమ అయ్యే విధానం
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పెట్టుబడి సాయం 3 విడతల్లో ప్రతి సంవత్సరం 20,000 రూపాయలను ప్రభుత్వం నేరుగా రైతుల యొక్క ఖాతాలకు జమ చేయనుంది.
▶️ మొదటి విడత (PM కిసాన్ నిధుల నుంచి 2,000 + అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 5,000).
▶️ రెండవ విడత ( PM కిసాన్ నిధుల నుంచి 2,000 + అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 4,000)
▶️ మూడో విడత ( PM కిసాన్ నిధుల నుంచి 2,000 + అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 5,000)
How to find Application status – అర్హుల జాబితా చూసుకునే విధానం
🔻 మీ మొబైలు లేదా ల్యాప్టాప్ నందు అన్నద్ధత సుఖీభవ webpage ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది.Webpage link ఓపెన్ చెయ్యండి.

🔻పైన ఫోటో లో చూపిన విధంగా Know your status మీద క్లిక్ చెయ్యాలి.

🔻రైతు ఆధార్ నెంబర్ ఇచ్చి ఎంటర్ captcha లో పక్కన ఉన్న ఎల్లో కలర్ నెంబర్ ని ఎంటర్ captcha లో ఇచ్చి search అనే ఆప్షన్ ని క్లిక్ చెయ్యాలి.