Adabidda Nidhi Scheme 2025

Adabidda Nidhi Scheme 2025

Adabidda Nidhi Scheme 2025:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మహిళలు 18 సంవత్సరాలు పూర్తయిన వారు 19 నుంచి 59 సంవత్సరాలు వయసులోపు ఉన్న మహిళలకు ప్రతి నెల ₹1500 (1500*12=18,000) వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేసేలా కూటమి ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని Adabidda Nidhi Schemes 2025 రూపంలో తీసుకురాబోతుంది.ఈ పథకానికి సంబంధించిన అర్హతలు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Adabidda Nidhi Scheme 2025 Overview

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు ప్రతి నెల వారి సౌకర్యాల కొరకు రాష్ట్ర ప్రభుత్వము ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలులోకి తీసుకురానుంది. ఈ పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల ఆర్థిక సహాయం కింద వారి యొక్క బ్యాంకు ఖాతాలకు₹1500 రూపాయలను జమ చేయనుంది. 

పధకం పేరు ఆడబిడ్డ నిధి – 2025
కేటాయించిన నిధులు 3,300 కోట్లు
లబ్ధిదారులు 19 నుంచి 59 సంవత్సరాలు వయస్సు కలిగిన మహిళలు
వెబ్సైట్ ఇంకా అందుబాటులోకి రాలేదు
ప్రారంభ తేదీ ఇంకా అందుబాటులోకి రాలేదు
అప్లికేషన్ చేసే విధానం ఆన్లైన్ ద్వారా/గ్రామ సచివాలయాల ద్వారా చేయవచ్చు

Adabidda Nidhi Scheme 2025 – Budget

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో ఈ పథకానికి Aadabidda Nidhi Scheme 2025 సంబంధించి 3,300 కోట్ల రూపాయలను కేటాయించింది. కేటాయించబడిన నిధులను కేటాయింపు ఇలా చేయనున్నారు. 

వర్గంకేటాయించిన నిధులు
బీసీ మహిళలకు₹1,069.78 కోట్లు
EBC మహిళలకు₹629.37 కోట్లు
మైనారిటీ మహిళలకు₹83.79 కోట్లు
ఎస్సీ,ఎస్టీ మహిళలకు మిగులు నిధులు

Adabidda Nidhi Scheme 2025 – Eligibility

🔸ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి. 

🔸ఈ పథకం SC,ST,BC,EBC,MINORITY మహిళలకు మాత్రమే.

🔸18 సంవత్సరాలు పూర్తయిన మహిళలు (19సంవత్సరం నుంచి 59 సంవత్సరాల మధ్య) వారు మాత్రమే అర్హులు.

🔸రేషన్ కార్డు కలిగిన మహిళలు. 

🔸ఆధార్ కార్డు కలిగి ఉండాలి (వయసు ధ్రువీకరణ కొరకు) 

🔸3 ఎకరాలు మాగాని/7 ఎకరాలు మెట్ట భూమి కలిగి ఉండకూడదు. రెండు కలిపి 10 ఎకరాలు మించి ఉండకూడదు. 

🔸విద్యుత్ వినియోగం 300 యూనిట్లు మించి ఉండరాదు. 

Adabidda Nidhi Scheme 2025 – Require Documents

🔸ఆధార్ కార్డు 

🔸ఆధార్ అప్డేట్ హిస్టరీ

🔸రేషన్ కార్డు 

🔸కుల ధ్రువీకరణ పత్రం 

🔸పనిచేసే మొబైల్ నెంబర్ 

🔸బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్ 

🔸పాస్పోర్ట్ సైజ్ ఫోటో

Adabidda Nidhi Scheme 2025 – Application process

పథకానికి సంబంధించి ప్రభుత్వము ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకొనుటకు అవకాశం ఇవ్వవచ్చు. ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ పథకానికి సంబంధించి కేవలం నిధులు కేటాయింపులు మాత్రమే అందించింది. ఈ పథకానికి సంబంధించిన ప్రారంభ తేదీ వచ్చిన వెంటనే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా లేదా మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ చేయవచ్చు.

🔹 గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 

🔹 మీసేవ కేంద్రాల ద్వారా

Adabidda Nidhi Scheme 2025 – Application Status

పథకానికి సంబంధించి లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న తర్వాత వారి యొక్క అప్లికేషన్ స్థితిని తెలుసుకొనుటకు ప్రభుత్వము ఒక Webpage ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఆ Webpage నందు అప్లికేషన్స్ స్థితిని ఎలా సరిచూసుకోవాలో చూడండి. 

ఈ లింకు పైన క్లిక్ చేయండి 👉🏻 webpage link

👆పైన చూపిన విధంగా Webpage లో ముందుగా పథకాన్ని Select చేసుకోండి. 

👆పైన చూపిన విధంగా సంవత్సరాన్ని Select చేసుకోండి.

👆పైన చూపిన విధంగా లబ్ధిదారుని ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి. 

👆పైన చూపిన విధంగా పక్కనే ఉన్న Captcha ని ఎంటర్ Captcha లో ఎంటర్ చేయండి.

🔸Get OTP మీద క్లిక్ చేయండి. 

🔸ఆధార్ కి నమోదైన మొబైల్ నెంబర్ కు ఓటిపి వెళ్తుంది. 

🔸OTP ని నిర్ధారించండి.

🔸అప్లికేషన్స్ స్థితి వివరాలు ఓపెన్ అవుతాయి. ఇందులో Application Status నందు Eligible Remarks నందు Eligible ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.

Adabidda Nidhi Scheme 2025 – Final list

ఈ పథకానికి సంబందించిన ఫైనల్ లిస్ట్ గ్రామా/వార్డు సచివాలయాల ద్వారా తెలియచేస్తారు. మీరు తల్లికి వందనం పథకానికి సంభందించి ఏ విదముగా అర్హుల జాబితాను తెలుకొన్నారో అధె విధముగా ఈ పధకానికి సంభందించిన అర్హుల జాబితాని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వస్తుంది.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *